టీటీడీ న్యూస్
55 Posts • 30K views
PSV APPARAO
667 views 13 days ago
#శ్రీవారి భక్తులకు శుభవార్త 🕉️ భక్తులకు విజ్ఞప్తి #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #టీటీడీ న్యూస్!!!📰 #టీటీడీ న్యూస్ #శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ 👆 *భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు* తిరుమల, 2025, అక్టోబర్ 08 : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు. టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
10 likes
13 shares
PSV APPARAO
635 views 18 days ago
#కాల్ టు టిటిడి ఈవో ☎️ Dial Your EO #శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ #తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ #టీటీడీ న్యూస్!!!📰 #టీటీడీ న్యూస్ 👆 *సామాన్య భక్తులకు పెద్దపీట* *– భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం* *– బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి* *– మాడ వీధుల్లోని గ్యాలరీలలో షెల్టర్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల పరిశీలన* *– టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్* తిరుమల, 2025 అక్టోబరు 03: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గౌ.ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారన్నారు. భక్తులకు టిటిడి అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా గరుడసేవ నాడు ఉదయం ఎండ తీవ్రత, మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా, వారి విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు…… 1. శ్రీ శ్రీనివాస్ – కడప ప్రశ్న : రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు ప్రత్యేకంగా విడుదల చేయండి. ఈవో : పరిశీలిస్తాం 2. శ్రీ శంకరయ్య గౌడ్ – హైదరాబాద్ ప్రశ్న : నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు పరకామణి సేవ బుక్ చేసుకున్నాం. కానీ 14వ తేదీ రిపోర్టు చేయాలని ఉంది. ఈవో : సాఫ్టు వేర్ లో మార్పులు చేసాం, నవంబర్ 13వ తేదీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 3. శ్రీ మల్లేశ్వరరావు – పల్నాడు ప్రశ్న : ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి లెటర్ తో సంవత్సరంలో ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించండి. ఈవో : ఇప్పటికే రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్ లైన్ లో, తిరుపతిలో కరెంటు బుకింగ్ ఎస్ఎస్ డి టికెట్లు జారీ చేస్తున్నాం. శ్రీవారి దర్శనానికి వీటిని పొందవచ్చు. 4 శ్రీ శ్రీనివాస్ – మెట్టపల్లి ప్రశ్న: లడ్డు ప్రసాద సేవ తిరిగి ప్రవేశపెట్టండి. ఈవో: కొన్ని కారణాల వల్ల లడ్డు ప్రసాద సేవ ఆపివేశం. 5. శ్రీ వీరబాబు – కాకినాడ ప్రశ్న: అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టోకెన్లు మంజూరు చేయండి. ఈవో: ప్రతిరోజు 16 నుండి 24 వేల వరకు ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం. 6. శ్రీ నాగేశ్వరరావు – తిరుపూర్ ప్రశ్న : వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులను మధ్య తోపులాట ఎక్కువగా ఉంది. అక్కడ విధుల్లో ఉన్నవారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఈవో : వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపై శ్రీవారి సేవకులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. శ్రీవారి దర్శనానికి 20 గంటలకు పైగా భక్తులు వేచి ఉంటారు. కావున ఒక్క నిమిషం పాటైనా స్వామి వారిని చూడాలనుకుంటారు. క్యూలైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతాం. 6. శ్రీ నాగేశ్వరరావు – తిరుపూర్ ప్రశ్న :రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నప్పుడు వేడిగా ఉన్న అన్నప్రసాదాలు ఇచ్చిన వెంటనే గేట్లు తెరవడం వలన అన్నప్రసాదాలు వృధా అవుతున్నాయి. అదేవిధంగా తిరుమల సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు పూలు పెట్టుకు వస్తున్నారు, అవగాహన కల్పించండి. ఈవో : అన్నప్రసాదాలు వృధా కాకుండా చర్యలు తీసుకుంటాం. తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 8. కృష్ణ చైతన్య – ఖమ్మం ప్రశ్న : లక్కీ డిప్ ద్వారా శ్రీవారి సేవలు పొందాం. తిరుమలలో వసతిని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. గదులు పొందేందుకు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు అధిక సమయం ఇవ్వండి. ఈవో : పరిశీలిస్తాం. 9. గీతా కుమారి – పశ్చిమగోదావరి ప్రశ్న : సెప్టెంబర్ 16 నుండి 30వ తేదీ వరకు సీనియర్ శ్రీవారి సేవకులుగా సేవలు అందించాం. హరినామ సంకీర్తన వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పోలీస్ వారి కుటుంబ సభ్యులను అనుమతించారు, మాకు గేట్ తీయలేదు. ఈవో : 3500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాలలో అత్యద్భుతంగా భక్తులకు సేవలు అందించారు. ప్రత్యేకంగా గరుడసేవనాడు అందించిన సేవలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వల్ల ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. 10. శ్రీ హరికృష్ణ – ఖమ్మం మాధురి – హైదరాబాద్ ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో ప్రతినెలా ఇవ్వాలి. ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు, కావున ప్రతినెల అవకాశం కల్పించండి. ఈవో : చాలామంది భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టిటిడి బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 11 అలేఖ్య హైదరాబాద్ ప్రశ్న : వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీచేయండి. మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణాల వలన రాలేకపోతున్నారు. ఈవో : ఎక్కువ మంది భక్తులకు మేలు చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం. 12 అరుంధతి – హైదరాబాద్ సుబ్బలక్ష్మి – హైదరాబాద్ ప్రశ్న : వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇదివరకు తిరుమలలో ప్రతిరోజు కేటాయించే విధంగా దర్శన టోకెన్లు కేటాయించండి. ఆన్లైన్లో మూడు నెలలకు ముందు కాకుండా 15 రోజులకు ముందు విడుదల చేయండి. ఈవో: పరిశీలిస్తాం. 13. హరి ప్రసాద్ తిరుపతి, ప్రశ్న : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు దళారులు టిటిడి ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు దర్శనం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వలేదు. ఈవో : ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టిటిడి ఉద్యోగులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్యనారాయణ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది.
13 likes
5 shares
PSV APPARAO
622 views 29 days ago
#తిరుమల శ్రీవారికి విలువైన దివ్య ఆభరణాలు, విలువైన కానుకలు / భారీ విరాళాలు (డొనేషన్స్) 🙏 #టీటీడీ న్యూస్!!!📰 #టీటీడీ న్యూస్ #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS 👆 *శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం* తిరుమల, 2025 సెప్టెంబర్ 23: తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కoఠి ని మంగళవారం విరాళంగా అందించారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
12 likes
7 shares
PSV APPARAO
647 views 1 months ago
#తిరుమల వైభవం: తిరుమల శ్రీవారి దివ్య ఆభరణాలు #తిరుమల వేంకటేశ్వర స్వామి వైభవం #తిరుమల వేంకటేశుని వైభవం #టీటీడీ న్యూస్!!!📰 #టీటీడీ న్యూస్ 👆 *శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం* తిరుమల,2025సెప్టెంబర్ 22: శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం నాడు తిరుమలలో బహుకరించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
15 likes
8 shares