Failed to fetch language order
Failed to fetch language order
సోషల్ మీడియా
598 Posts • 7M views
P.Venkateswara Rao
2K views 15 days ago
#సోషల్ మీడియా *ఈ ‘క్రిమి దొడ్డి’ కేరక్టర్ నోరిప్పితే దుర్గంధం… కొత్వాల్ సాబ్, కొరడా తీయండి…❗* October 7, 2025🎯 శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ అనేవాడికి ఇదేమీ కొత్త కాదు… అసలు వాడొక్కడే (వాడు అనే పదం ఉద్దేశపూర్వకంగానే వాడుతున్నాను) మొదటివాడు కాదు, చివరి వాడూ కాదు… ఈమధ్య తాగి నోటికొచ్చినట్టు బలుపు మాటలు మాట్లాడుతున్నాయి సోకాల్డ్ సినిమా అక్కుపక్షులు… గతంలో ఫిలిమ్ క్రిటిక్స్ క్రిముల దొడ్డి నాకేవాళ్లు అని వాగాడు… పొట్టేల్ సినిమాపై రివ్యూలకు ప్రతిస్పందనగా… క్రిటిక్స్ అసోసియేషన్ వీడి మీద మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు కంప్లయింట్ చేసింది… ఏం జరిగింది, ఏమీ లేదు.. ఎహె, పోరా … మీరు నన్ను పీకేదేముంది అన్నట్టుగా కిమన్నాస్తిగా ఉన్నాడు… మంచు విష్ణుకు ఏ సోయీ లేదు, తరువాత ఫిలిమ్ క్రిటిక్స్ పట్టించుకున్నదీ లేదు… ఇప్పుడు ఏమంటున్నాడు..,? మహాత్మాగాంధీని ఉద్దేశించి నానా కూతలూ నోటికొచ్చినట్టు కూశాడు… అవన్నీ నేను రాయలేను, నేను శ్రీకాంత్ భరత్‌లా క్రిముల దొడ్డి బ్యాచ్ కాదు కదా… ఆసక్తి ఉన్నవాళ్లు ఇదుగో క్రింది ఈ న్యూస్ గ్రూప్ ఫేస్‌బుక్ పోస్ట్ చూడొచ్చు… (వీడి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకులే గానీ… స్వతహాగా పశువైద్యం చదివాడట…) https://www.facebook.com/reel/1164864662195901 ఐతే వీడొక్కడే కాదు… మొన్నామధ్య రాహుల్ రవీంద్ర అనేవాడూ పొట్టపలుగ తాగి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నానా కూతలూ కూశాడు, అదేలెండి, రాశాడు… ఒరేయ్, తాటతీస్తాంరా అని ‘ఎవరో’ ఓ దుడ్డుకర్ర చూపేసరికి… రెండు రోజులు సోషల్ మీడియా అకౌంట్లు డియాక్టివేట్ చేసుకుని, తరువాత తాపీగా రిస్టోర్ చేసి, అబ్బే, ఇకపై బుద్ధిగా ఉంటాను అని లెంపలేసుకున్నాడు… అంతెందుకు..? మన బాలయ్యే నిండు సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి సైకో గాడు అన్నాడు… ఇలా సినిమా సెలబ్రిటీలకు విచక్షణ లోపిస్తోందా..? లేక మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే మితిమీరిన ధీమాయా..? ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనేవాడికీ పెద్ద జడ్జిపై చెప్పు విసరబోయిన వాడికీ తేడా ఏముంది..? ఆమధ్య దిల్ రాజు, శ్రీముఖి తమ తప్పుకూతలకు క్షమాపణలు చెప్పుకున్నట్టు గుర్తు… వాడెవడో సినిమా ఫంక్షన్‌లో మన్మథుడు సినిమా హీరోయిన్ అన్షు అంబానీ సైజుల గురించి కూశాడు… జస్ట్, ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే… ఈ క్రిమి దొడ్డి శ్రీకాంత్ మీద మంచు విష్ణు ఏమీ చర్య తీసుకోలేడు గానీ… ఎక్కడా ఇప్పటివరకు పోలీసులు కేసు పెట్టినట్టు వార్తలయితే (ఈ కథనం రాసే సమయానికి) కనిపించలేదు… జాతిపితగా కీర్తించబడే వ్యక్తి మీద నానా పిచ్చి కూతలూ కూస్తే… ఎవరో ఎందుకు కంప్లయింట్ చేయడం, పోలీసులే సూమోటో కేసు పెట్టొచ్చు కదా… ఏమైంది మరి..? చిత్రమేమిటంటే, పబ్లిక్ డొమైన్‌లో వీడి కుసంస్కార కూతలకు కూడా నెట్‌లో మద్దతు లభించడం..!! ఒకడి మీద కొరఢా ఛెళ్లమంటేనే కదా… ఆ కొరఢా భయంతో మిగతావాళ్లు గీత దాటకుండా ఉంటారు..? వీడి మీద హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టి, కాస్త బుద్ది చెప్పాలని ‘ముచ్చట’ కోరిక..!
26 likes
26 shares
P.Venkateswara Rao
624 views 1 months ago
#సోషల్ మీడియా #📰జాతీయం/అంతర్జాతీయం #📰జాతీయం/అంతర్జాతీయం *అవమానాల్ని అవకాశాలుగా మలుచుకోలేమా❓* SEPTEMBER 21, 2025🎯 అమెరికానే కాదు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలు……… విదేశీయుల్ని తమ దేశం విడిచి వెళ్లాలని కోరుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చి, తమ బతుకుదెరువుపై దెబ్బ కొడుతున్నారని, కావున దేశం నుంచి వెళ్లిపోవాలని ఇటీవల కాలంలో భారీ ర్యాలీలు నిర్వహించడం చూస్తున్నాం. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగుపాటు నిర్ణయాన్ని తీసుకున్నారు. హెచ్-1 బీ వీసా వార్షిక రుసం లక్ష డాలర్లగా ప్రకటించి, షాక్ ఇచ్చారు. మన దేశ కరెన్సీలో హెచ్-1 బీ వీసా కోసం రూ.88 లక్షలు చెల్లించాలట! ఇంత భారీ మొత్తంలో వీసాకు ఖర్చు పెట్టడం అసాధ్యమనే మాట వినిపిస్తోంది. డాలర్స్ డ్రీమ్ ఇక ముగిసినట్టే అనే చర్చకు తెరలేచింది. ఈ సందర్భంలో ప్రధాని మోదీ అద్భుత మాట అన్నారు. విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువని మోదీ అన్న మాట అమూల్యం. స్వావలంబనే సమస్యలన్నింటికీ పరిష్కారం అన్న ఆయన మాట పచ్చి నిజం. మన దేశంలో లేని వనరులంటూ లేవు. అయితే కావాల్సిందల్లా……… మన దేశంలో మొట్టమొదట బతకడానికి సరైన వ్యవస్థను ఏర్పరచుకోవాలి. వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి. అది పాలకులపై ఆధారపడి వుంది. ముందుగా, పరిపాలనాపరమైన వ్యవస్థను దారిలో పెట్టుకుంటే, ఆటోమేటిక్గా అన్నీ దారిలోకి వస్తాయి. ఇక స్వావలంబన విషయానికి వస్తే, మన వనరుల్ని ఉపయోగించుకుని, అద్భుతమైన సౌధాలు నిర్మించుకోవచ్చు. ప్రధానంగా మన దేశం వ్యవసాయ రంగంపై ఆధారపడింది. అయితే సరైన సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధరల్లేకపోవడం తదితర కారణాలతో వ్యవసాయం లాభసాటి కాలేదు. దీంతో వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకోలేని దయనీయ స్థితి ఏర్పడింది. దేశానికి రైతు అన్నం పెడతారనే మాట కేవలం నినాదానికే పరిమితమైంది. వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆ రైతుకే అన్నం దొరకని దుస్థితి. పొలాన్ని నమ్ముకున్న యువకులకు అమ్మాయిల్ని ఇచ్చి వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఎక్కడైనా కంపెనీల్లో రూ.10 వేలు జీతం వచ్చినా సుఖంగా బతుకుతారని అనుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా వ్యవసాయం లాభసాటి కాకపోవడం వల్ల కలిగిన అనర్థాలు. సాగునీటి ప్రాజెక్ట్లను నిర్మించి, బీడు భూముల్ని పచ్చదనంతో నింపే అవకాశం కల్పిస్తే, మన దేశం సంపదతో విరాజిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే తీసుకుందాం. రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పోలిస్తే నెల్లూరు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. దీనికి కారణం..రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సరైన సాగునీటి వ్యవస్థ ఇంత వరకూ లేదు. ఇదే నెల్లూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, అలాగే గుంటూరులోని కొన్ని ప్రాంతాలకు సాగునీళ్లు పుష్కలంగా అందుతున్నాయి. దీంతో ఆ భూముల రేట్లు ఎంతో ఎక్కువ. అలాగే ఏడాదిలో రెండు, మూడు పంటలు పండించుకుంటున్నారు. కానీ సాగునీళ్లు లేని రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరవుతో అల్లాడుతున్నారు. ఇప్పటికీ సాగునీళ్లు అందించే ప్రయత్నాలు వేగంగా జరగడం లేదు. వ్యవసాయాన్ని కాపాడుకుంటే, ఆ రంగం మిగిలిన అన్ని రకాల వ్యాపారాల్ని రక్షిస్తుంది. రైతులు, కూలీలు ఆర్థికంగా బాగుంటే, వ్యాపారాలన్నీ కళకళలాడుతాయి. సినిమా టికెట్ల రేట్లపై పాలకులు చూపే శ్రద్ధాసక్తులు, పంటల గిట్టుబాట ధరలపై కూడా కాస్త పెడితే రైతాంగానికి మంచి రోజులు వచ్చినట్టే. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని స్థాపించుకోవచ్చు. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి వుండదు. విదేశాల్లో అక్కడి పాలకులు... తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఛీత్కరిస్తుంటే, అవమానాల్ని దిగమింగుతూ అక్కడే బతకాల్సిన దుస్థితి పగవారికీ రాకూడదు. మన దేశంలో బతకడానికి వనరులే లేవా? అంటే.. ఎన్నో ఉన్నాయనే సమాధానం వస్తుంది. కానీ లేనిదల్లా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇక్కడి వనరుల్ని అద్భుతమైన సంపదగా మలుచుకోవచ్చనే సంకల్పం ఉన్న రాజకీయ వ్యవస్థ కొరవడింది. ఎంతసేపూ రైతులకు భిక్షం వేస్తున్నట్టుగా ఏడాదికి రూ. 6వేలని ఒకరు, రూ.14 వేలని మరొక ప్రభుత్వ హామీతో ఓటర్లగా వాడుకుంటున్నారు. ఇంతకు మించి రైతులకు శాశ్వతంగా ప్రయోజనం కలిగించే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించే వ్యవస్థల్ని తీసుకురాకపోవడం మన పాలనా వైఫల్యమే. అలాగే ఇక్కడి దుర్మార్గ రాజకీయాలు కూడా, మేధో వలసలకు కారణమవుతున్నాయి. అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న రాజకీయ నాయకుల్ని చూసి, విదేశాల్లో అవమానాల్సి భరిస్తాం తప్ప, మన దేశంలో బతకలేమనే ఆలోచనలకు కారణం మన నాయకులే. ఇలా విదేశాలకు మేథో వలసకు అనేక కారణాలు తోడయ్యాయి. ఇప్పుడు విదేశాల్లో అక్కడి వాళ్లకు మనం భారమవుతున్నాం. విదేశీయుల ఆందోళనలకు ఇప్పుడిప్పుడే బీజం పడుతోంది. అప్రమత్తమైన తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఏం జరుగుతుందో ఊహకు అందదు. కావున మన పాలకులు... మనవాళ్లు బతుకుదెరువుకు విదేశాలకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించుకోవాలి. మన గడ్డపై ఉపాధి అవకాశాల్ని మెరుగుపరచాలి. అందుకు తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. స్వావలంబన కేవలం ఆలోచనకే పరిమితం కాకూడదు.
5 likes
11 shares