శ్రీ వినాయక వైభవం 🕉️
3 Posts • 16K views
PSV APPARAO
811 views 1 months ago
#గణపతి తత్వం #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #శ్రీ వినాయక వైభవం 🕉️ *గణపతి తత్త్వం* 'గ' అనే అక్షరం జ్ఞానవాచకం, 'ణ' అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణశాసకుడు గణపతి. కంటికి కనిపించే విశ్వం పంచభూతాత్మకమైంది. దీన్నే 'జగము' అంటారు. 'జ' అంటే పుట్టి; 'గ' అంటే గతించేది. జగము, గజము పరస్పర సంబంధం కలిగిన విషయాలు. వ్యక్తం నుంచి అవ్యక్తం వైపుకు సాగే పయనమే గణేశ తత్త్వం. గణపతి ఏకదంతుడు. ఆయనకు ఉన్న ఇరవై ఒక్కనామాలలో శూర్పకర్ణుడు అనే పేరులోని అర్ధాన్ని లోతుగా పరిశీస్తే 'భక్తుల మొరలను బాగా వినడమే నా పని అన్న సంకేతం కనిపిస్తుంది. తాలును పోగొట్టి అసలైన ధాన్యాన్ని మన కందించే వేటలవంటి చెవులు ఆయనకున్నాయి. తాలు వంటికోరికల్ని పక్కకి నెట్టేసి మంచి కోరికలు తీర్చే దాక్షిణ్యమూర్తి ఆయన. వినాయకుడు వక్రతుండుడు ఆ తొండం ప్రణవస్వరూపం... ఓం కారమంటే పరబ్రహ్మం. ఆ తొండాన్ని ఆరాధిస్తే. మూలాధారదైవాన్ని ఆరాధించినట్టే.. మాయను నివారించే మహిమగల స్వామి వక్రతుండ గణపతి ఆయన వాహనం ఎలుక ఇంద్రియ చాపల్యానికి సంకేతంగా ఎలుకను తత్త్వజులు అభివర్ణించారు. ఆ అసురతత్త్వాన్ని అణిచివేయడం గణపతి లక్షణం కనుక మూషికాన్ని వాహనంగా స్వీకరించాడు. ఆయన సూక్ష్మనేత్రుడు. ఆ చిన్ని కళ్లు సూక్ష్మదృష్టికి దివిటీలు. సూక్ష్మబుద్ధికి సంకేతాలు. పురుష రూప దేవతలకు వారి శక్తులనే భార్యలుగా సంభావన చేసింది శ్రీ శాస్త్రం, అందువల్ల 'సిద్ధి బుది' గణపతి భార్యలుగా పేర్కొన్నాయి కొన్ని పురాణ కథనాలు, సర్వలోకాలు గణపతి ఒజకు బొజ్జలో ఉన్నాయి. విష్ణు ప్రసాద పుష్పాన్ని అలంకరించుకున్న ఏనుగు ముఖంతో పుట్టిన శివపుత్రుడు సృష్టికి ఆద్యుడు కనుక త్రిమూర్త్యాత్మిక స్వరూపుడు గణపతి. వినాయకుని వీణపేరు 'లకుమి'. సంగీత శిక్షణారంభంలో లంబోదర లకుమి కరా అన్న కీర్తన వినపడుతుంది. ఆయన సంగీత ప్రియుడు. నృత్య ప్రియుడు. ఆయన సకల కళా నిలయుడు. ప్రపంచంలో కళల వలనే సుఖ సంతోషాలు విలసిల్లగలవని పావన గణపతి భావన. వినాయకుడి ఆరాధనలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ. గాణపత్యాలనే అయిదు ఉపాసనలు నిబిడీకృతమవడం వల్ల సర్వమతాలను సమానంగా చూచే గాణపత్యం పొందినవాడాయన. గణపతికి తొమ్మిది రాత్రులపాటు ఉత్సవాలు చేస్తారు. పూర్ణ బ్రహ్మపదాన్ని సాధించడమే యీ తొమ్మిది సంఖ్యకు గల సంకేతం ఏకవింశతి (21) పత్రాలతో స్వామిని పూజిస్తారు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. తన్మాత్రలు 5 5 మనస్సు ఒకటి కలిపితే మొత్తం 21. 21. వీటిన్నింటితో కూడిన శరీరంతో వినాయకచవితినాడు ఏకవింశతిపత్ర పూజ చేస్తాం. కన్యారాశిలో సూర్యుడున్నప్పుడు చంద్రుణి చూడరాదని శాస్త్రం. గణేశుడు పరంజ్యోతి అయిన ఆత్మ. సూర్యుడిచ్చినట్టు చెప్పబడే శ్యమంతకమణి ఆత్మకు ప్రతిక చంద్రుడు మనస్సుకు సంకేతం. మనస్సును ఆత్మలో లయంచేయకపోతే అనర్థం అని శ్యమంతకోపాఖ్యానం చెబుతుంది. మానవ - జంతు ఆకృతులు కలగలిసిన రూపాలు గల దేవతలు త్వరగా కరుణిస్తారని మంత్ర శాస్త్రం చెబుతోంది. గణపతి అష్టోత్తర శతనామావళిలో 'ఓం కలికల్మష నాశనాయ నమః' అన్న నామం వుంది. కలౌ చండీవినాయకౌ అన్నట్లుగా కలిలో సత్వరంగా అనుగ్రహించే దైవం ఆయన. విభిన్నపురాణాలలో విభిన్న. రీతులలో గణనాయకుడి గాధలున్నాయి. ఆయన మానవులు తలపెట్టిన సకల కార్యాలనూ నిర్విఘ్నంగా పూర్తిచేయించి సాఫల్యం కలిగిస్తాడు. కీర్తిని ప్రసాదిస్తాడు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
19 likes
22 shares
PSV APPARAO
777 views 1 months ago
#వినాయక చవితి వైభవం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహ భాషణం 🙏🕉️🛕🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #వినాయక వైభవం 🕉️🔱🕉️ వినాయకుని విశిష్టత 🙏 #శ్రీ వినాయక వైభవం 🕉️ #గణపతి తత్వం *అనేకమూర్తుల ఆదిదేవుడు* *సిద్ధిబుద్ధిప్రదం నృణాం ధర్మార్థకామమోక్షదం* *బ్రహ్మరుద్రరవీంద్రాద్యైః సంస్తుతం పరమర్షిఖిః* వేదప్రతిపాద్యమైన ఒకే పరబ్రహ్మను ఆరు రూపాలుగా ప్రధానంగా ఆరాధించడమనేది మన సనాతన వైదిక ధర్మం. అవి-గణపతి, విష్ణువు, శివుడు, సూర్యుడు, శక్తి(అమ్మవారు), సుబ్రహ్మణ్యస్వామి. *'ఏకం సత్ విప్రా బహుధా వదంతి'* అన్నట్లుగా ఉన్న ఒకే సత్ ఈ రూపాలుగా మార్పు చెందింది. గణపతిని కొలిచినప్పుడు కూడా ఆ *'ఏకం నత్'* అయి సృష్టిస్థితిలయలకు కారణమైన పరబ్రహ్మగా ఆరాధించాలి. అలా ఆరాధిస్తే అదే గాణాపత్యమనే వేదసమ్మతమైన షణ్మతాలలో ఒకటి. *'గణేశో వై సదజాయత తద్ వై పరంబ్రహ్మా'* అని ఉపనిషత్తులు కూడా గణేశుని పరబ్రహ్మగా నిర్ధారించాయి. *సమామి పరమాత్మానం సచ్చిదానందవిగ్రహం* *చరాచరగురుం సర్వకారణానాం చ కారణం* *త్రితనుం చ త్రయీమూర్తిం బ్రహ్మవిష్ణుశివాత్మకం* - అని గణపతిని శాస్త్రాలు కీర్తించాయి. *'సర్వదేవమయః సాక్షాత్ సర్వమంగళదాయకః'* అని సర్వదేవమయునిగా గణపతిని దర్శించాలి. ఈ ఆరింటిలో దేనికదే పరబ్రహ్మప్రాప్తిని కలిగించేదిగా ఉన్నా గణపతిది ఒక ప్రత్యేకం. ముందుగా అతనిని ఆరాధించనిదే మరి ఏ దైవం కూడా ప్రసన్నులు కారు. అందుకే ఏ వ్రతమాచరించినా, పూజాడులు చేసినా ముందుగా గణపతినే ఆరాధిస్తాం. అలా ముందుగా ఆరాధింపబడేవాడు కనుక 'ఆది'దేవుడు, ఏ మంత్రానికైనా ప్రణవం ఎలా ఆదిగా ఉంటేనే మంత్రం శక్తిమంతం అవుతుందో, ఆ ప్రణవమే వదనంగా కలిగిన (ప్రణవాకారం వక్రతుండం) గణపతి 'ఆదిదేవుడు. 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మా' అని చెప్పినట్లుగా ఓంకారాకారుడైన విఘ్నేశ్వరుడే పరబ్రహ్మ అనేది స్పష్టమవుతోంది. సృష్ట్యాదిలో బ్రహ్మకు కలిగిన విఘ్నాలు తొలగించి సృష్టి జరగడానికి అది దేవుడయ్యాడు. ఏ కావ్యసృష్టికైనా సరే ఋషులనుండి నేటి కవుల వరకు ఎవరైనా ఆ 'ఆది'దేవుడే ఆదిగా ప్రార్ధిస్తున్నారు. వాక్కు వెలువడడానికి కారణాలైన పరా-పశ్యంతి-మధ్యమ-వైఖరులలో మొదటిదైన పరావాక్కు జనించే స్థానం మూలాధారం, ఈ విధంగా వాక్కులకు కూడా 'అది'దేవుడై అక్షరగణపతిగా అనుగ్రహిస్తున్నాడు. సృష్టిస్థితిలయాది పంచకృత్యాలకు మూలమైనవానిగా గణపతి ఎప్పుడు అవతరించినా గజవదనుడే. ఎందుచేతనంటే ఆ గజవదనమే బ్రహ్మతత్త్వాన్ని తెలియజేసేది అని శాస్త్రవచనం. ఏకం సత్గా పసుపుతో చేసిన లింగాకారంగా నిర్గుణబ్రహ్మగా పూజలందుకునే గణేశుడే భక్తుల అభీష్టాలు నెరవేర్చి అనుగ్రహించడా (భక్తానుగ్రహవిగ్రహం)నికి అనేక అవతారాలు దాల్చాడు. భూలోకవాసులకే కాక దేవతలను సైతం అనుగ్రహించే మూర్తి. ఇహలోకజీవితంలో కూడా మానవులకు ఏ ప్రయోజనం సిద్ధించాలన్నా ఆ ప్రయోజనానికి తగిన విధంగా గణపతి రూపాలను ఆగమాలు వర్ణించాయి. విద్య కావాలంటే 'విద్యాగణపతి', 'అక్షరగణపతి' సంపదకు 'సంపత్ గణపతి', నంతానానికి 'సంతానగణపతి', 'ఋణహరగణవతి', 'సంకష్టనివారకగణపతి', ఏ కార్యానికైనా సిద్ధిని కలిగించే 'సిద్దిగణపతి', 'శక్తిగణపతి', 'లక్ష్మీగణపతి', 'విజయగణపతి'. ఇవే కాక వంచపదనాలతో 'హేరంబగణవతి', 'ఉచ్ఛిష్టగణపతి'... ఇలా వేలకొద్ది నామాలు, ప్రతినామానికి ఒక రూపం, యంత్రం, శాస్త్రం ఉన్నాయి. సరైన ఋజుజీవితానికి, పరబ్రహ్మప్రాప్తికి ఆటంకాలుగా ఉందే కానుక్రోధాది ఎనిమిది దోషాలను అదుపుచేసే గణనాయక, మోరేశ్వర ఇత్యాది ఎనిమిది అవతారాలు కూడా ప్రసిద్ధిగా ఉన్నాయి. సృష్టిలో ప్రతిదీ గణములుగా ఉంటాయి. ప్రతి గణానికి పతి కనుక గణపతికి కూడా అనేక రూపాలు ఉన్నాయి. వేదం ప్రకారంగా విశ్వానికి ఆధార ప్రాణశక్తిగా ఉన్నవాడు గణపతి. ఈ ప్రాణశక్తియే కూర్మ, శేష, గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద మొదలైన అన్ని ప్రాణశక్తులకు ఆధారమైనది. యోగపరంగా చూసినా ఆదిచక్రమే కాక ఆధారచక్రమైన మూలాధారం గణపతి నివాస స్థానం. అక్కడ కుండలినీ కదలనిదే ఊర్ధ్వగమనం సాగదు. యోగగమనానికి కూడా గణపతియే ఆదిదేవుడు. కాబట్టి గణపతి ప్రసన్నుడవడం యోగమార్గంలో కూడా అత్యంతావశ్యకం. పశువులలో వాటి దేహమధ్యస్థానమైన హృదయమునందు, పక్షులలో ఉదరభాగమందు, వృక్షములకు మూలమునందు గణపతి ఆవాసమై ఉంటాదు అనేది శాస్త్రం తెలిపిన విషయం. ఇన్ని రూపాలుగానున్న గణపతి యొక్క శ్రేష్టత్వాన్ని తెలుసుకుని ఐహికాముష్మిక వలితాలు సిద్ధించడానికి నిర్దేశింపబడినదే వరసిద్ధి వినాయక వ్రతం, వర అనే మాటే శ్రేష్టత్వాన్ని సూచిస్తోంది. అంతే కాక అనేక వరాలను ఇచ్చేవాడు కనుక వరదుడు కూడా (వరాన్ దదాతీతి వరదః), గణపతికి సంబంధించిన అనేక మంత్రాలలో కూడా వర, వరద అనే పదాలు గోచరిస్తుంటాయి. భాద్రపద శుద్ధ చవితినాడు వరసిద్ధి వినాయకుడు అనే పేరుతో పార్థివ(మట్టి)మూర్తిగా, నాలుగు చేతులవానిగా పూజించాలి. పన్నెండు మాసాలలో వివిధ నామాలతో, రూపాలతో గణపతి ఆరాధన, ఆ సమయంలో కొలుచుకునే దేవతాగణాల వివరాలు కూడా పురాణాలలో వర్ణించబడింది. గణపతిని ప్రధానదైవంగా ఆరాధించేవారు ప్రతి మాసంలో చవితి నాడు ఆ యా పేర్లతో పూజించుకోవచ్చు. చైత్రం-ధూమ్రవర్ణగణపతి, వైశాఖం - హేరంబుడు, జ్యేష్ఠం- వినాయకుడు, ఆషాధం-గజాననుడు/ఢుంఢిరాజు, శ్రావణం-గణేశుడు భాద్రపదం- వరసిద్ధివినాయకుడు/మయూరేశుడు. ఆశ్వయుజం-విఘ్నేశ్వరుడు, కార్తికం-వక్రతుండుడు, మార్గశీర్షం-వికట వినాయకుడు, పుష్యం-లంబోదరుడు, మాఘం- సంకష్టహరుడు, ఫాల్గుణం-గణేశుడు. అంతేకాక మంగళవారం చతుర్థి కలిసినది అంగారక చతుర్థిగా గణపతి ఆరాధనకు ప్రత్యేకం. ఆదివారం చవితి కలిసిన రోజున చేసే ఆరాధన విశేష ఫలితాలను కలుగజేస్తుంది. పన్నెండు చతుర్థీవ్రతాలు చెయ్యలేకపోయినా భాద్రపదశుద్ధ చతుర్థి నాడు శ్రద్ధాభక్తులతో చేసే వ్రతం వల్ల అన్ని చతుర్థీవ్రతాలు చేసిన ఫలితం కలుగుతుంది. ఈ చవితి చాలా ప్రత్యేకమవడానికి కారణం అనేక సందర్భాలలో ఈ తిథినాడే గణేశప్రాదుర్భావం జరిగింది. పార్వతీదేవి మేని (వంటి) వనుపుతో ఒక కల్పంలో ఆవిర్భవించగా, బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శివ-పార్వతులకు శ్రీకృష్ణుడే గణపతి (పుత్రుని)గా ఈ తిథినాడే అవతరించాడు. సకల గణాలకు అధిపతిగా ఈ “తిథినాడే పట్టాభిషేకం కూడా జరిగింది. మానవుల జీవనగమనం అనేక గణాలతో కలిసే సాగుతుంటుంది. మన దేహంలోనే ఇంద్రియములు, బుద్ధి మొదలైనవి ఎన్నో గణాలు, కుటుంబసభ్యులు, బంధువులు -ఇదంతా ఒక గణం. మనం ఇంద్రియాల ద్వారా గ్రహించే ఆహారాదులన్నీ కూడా గణసమూహాలే, మన జీవితంపై ప్రభావం చూపించేవి గ్రహగణాలు. ఆ గణాలన్నిటికీ అధిపతిగా మన హృదయంలోనే గణపతిని రాజుగా పట్టాభిషేకం చేసి మనలను పాలించమని వేడుకుంటే సకల విఘ్నాలు తొలగి చతుర్విధ పురుషార్థాలు సిద్ధించి, జీవితలక్ష్యమైన గణేశ బ్రహ్మమును పొందగలం. *దీననాథ! దయాసింధో! యోగిహృత్పద్మసుస్థిత!* *అనాదిమధ్యరహితస్వరూపాయ నమో॥, స్తుతే.* *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
9 likes
15 shares
PSV APPARAO
553 views 1 months ago
#శ్రీ వినాయక వైభవం 🕉️ #గణేశ వైభవం #వినాయక చవితి స్పెషల్ #వినాయక మండపాలు #వినాయక చవితి శ్రీవినాయక మండపంలో శ్రీబాలగంగాధరతిలక్‌గారు మరియు ఛత్రపతిశివాజీమహారాజువారి చిత్రపటాలు ఎందుకు పెట్టాలో మీకు తెలుసా..??? అసలు మన భారతదేశంలో సనాతన హైందవధర్మంలో ఏ పండుగకూ లేని విశిష్టత, ప్రత్యేకత శ్రీవినాయకచవితి ఉత్సవాలకు మండపములు వేసి స్వామివారి మూర్తి ప్రతిష్టచేసి, అదేవిధంగా దుర్గాదేవి నవరాత్రులలో కూడా అమ్మవారి మూర్తి ప్రతిష్టచేసి పూజలు చేసుకునే విధానం ఎప్పుడు మొదలైందో తెలుసా..??? భారతదేశమును బ్రిటిషువారు పరిపాలించే కాలంలో రోడ్లపై భారతీయులు ఇద్దరు, ముగ్గురు తప్ప సమూహంగా కనిపించడానికి వీలులేదని 144 సెక్షన్ అమలుచేసేవారు., ఎక్కువమంది కనిపిస్తే అరెస్టు చేయడం, కేసులు పెట్టడం చేస్తుండేవాళ్ళు., అటువంటి పరిస్థితులలో శ్రీబాలగంగాధరతిలక్‌గారి ఆలోచనలతో ప్రతి వినాయకచవితి పండుగ వచ్చేటప్పుడు శ్రీవినాయకచవితి ఉత్సవాలు నిర్వహించుకొనుటకు పర్మిషన్ తీసుకుని, పందిరివేసి వినాయకచవితి పూజలు నిర్వహిస్తూనే, అక్కడ ప్రజలందరూ సమావేశమయ్యే విధముగా తీర్చిదిద్దటంలో ఒక ఆయుధమే ఈ యొక్క పందిరి/మండపం., వినాయకచవితి పందిరి దగ్గర భారతీయులందరినీ పోగుచేసి బ్రిటిషు ప్రభుత్వంపై, వారి పాలనపై తిరగబడి పోరాటాలు ఎలా చేయాలనే విధానంపై అక్కడ చర్చించేవారు., ఆ విధంగా మన వినాయకచవితి పందిరితో బ్రిటిషు ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది..! 🙏👍🙌🤝🌹♥️🌺👌✌️👏
9 likes
17 shares