ShareChat
click to see wallet page
#ఏపీ అప్ డేట్స్..📖 #🏛️రాజకీయాలు *ఆంధ్రా చెవిలో లులు పువ్వు.. ఈ డీల్ చూస్తే❗* OCTOBER 20, 2025🎯 ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చెవిలో రాష్ట్ర ప్రభుత్వం, లులు గ్రూప్ పెద్ద పువ్వు పెట్టాయి. గుజరాత్లో తాజాగా ఆ మల్టీ నేషనల్ కంపెనీ భూమి కొనుగోలు డీల్ .. ఏపీ ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిందనే వాస్తవాన్ని బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో కొన్నేళ్లుగా లులు గ్రూప్ కేంద్రంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు సర్కార్కు అత్యంత ఇష్టమైన కంపెనీగా లులు గుర్తింపు పొందింది. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఆ కంపెనీకి విజయవాడ, విశాఖలలో అప్పనంగా భూసంతర్పణంగా జరిగింది. ఇదే కంపెనీ గుజరాత్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి తాజాగా ముందుకొచ్చింది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత పదేళ్లకు పైగా దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఏపీలో మాదిరిగా గుజరాత్లో లులు గ్రూప్నకు ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టకపోవడం విశేషం. అహ్మదాబాద్ చరిత్రలో లులు కంపెనీ భూవిక్రయాన్ని అతిపెద్ద డీల్ ఆ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వర్గాలు ప్రకటించడం విశేషం. చంద్ఖేడాలో 66, 168 చదరపు మీటర్ల భూమిని లులు ఇంటర్నేషన్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.519.41 కోట్లకు కొనుగోలు చేసి ఆల్టైమ్ రికార్డ్ రియల్టర్లు గర్వంగా ప్రకటించారు. సబర్మతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. స్టాంప్ డ్యూటీ కింద గుజరాత్ ప్రభుత్వానికి రూ.31 కోట్ల ఆదాయం సమకూరింది. అహ్మదాబాద్ నగర చరిత్రలో ఇదో రికార్డ్. ఇదే లులు గ్రూప్నకు కూటమి సర్కార్ ఎలా సాగిలపడిందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు, అలాగే ఉద్యోగాల పేరుతో ప్రజల్ని ఏ రకంగా మోసగిస్తున్నారో, గుజరాత్ డీల్ చెప్పకనే చెబుతోంది. ఈ లులు గ్రూప్నకు విజయవాడ, విశాఖలో విలువైన భూముల్ని ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా, ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ప్రశ్నించే వాళ్లందర్నీ రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది, జరుగుతోంది కూడా. అబుదాబీ కేంద్రంగా ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ లులు గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి విశాఖలో వాల్తేరు హార్బర్ పార్కు వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజ్కు ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ జూలైలో ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. చదరపు అడుగుకు నెలకు కేవలం రూ.1.50 చొప్పున వసూలు చేస్తారు. ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు అద్దె చెల్లిస్తుంది. మొదటి మూడేళ్లు ఎలాంటి లీజు వుండదు. నిర్మాణం పూర్తయ్యాకే లీజు వసూలు చేయాలనే నిబంధన విధించడం ఇక్కడి ప్రత్యేకత. విశాఖలో చదరపు అడుగుకు రూ.40-50 వరకు అద్దె ధర పలుకుతోంది. అలాగే ప్రతి పదేళ్లకు కేవలం పది శాతం అద్దె ధర పెంచాలని నిర్ణయించడం గమనార్హం. అయితే విశాఖలో రూ.680 కోట్ల విలువైన ఈ స్థలాన్ని లులు గ్రూప్నకు ఇవ్వడాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఈ ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతోంది. గత ప్రభుత్వం విలువైన భూమిని రద్దు చేసి, వీఎంఆర్డీఏకు అప్పగించింది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే వీఎంఆర్డీఏ నుంచి నుంచి భూమి తీసుకుని ఏపీఐఐసీకి అప్పగించింది. ఆ భూమినే లులుకు కట్టబెట్టింది. గుజరాత్లో 66,168 చదరపు మీటర్ల భూమిని రూ.519.41 కోట్లతో కొనుగోలు చేసి వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్దమవడాన్ని గమనించొచ్చు. కానీ ఏపీకి వచ్చే సరికి అంతకు రెండింతల స్థలాన్ని అత్యంత కారు చౌకగా, దాదాపు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కొట్టేయడం వెనుక చిదంబర రహస్యమేంటో పాలకులకే తెలియాలి. విజయవాడలో లులు కంపెనీ కథేంటో తెలుసకుందాం. విజయవాడ నడిబొడ్డున గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులు చేతిలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది. ఆ కంపెనీ అక్కడ కేవలం రూ.156 కోట్ల పెట్టుబడి మాత్రమే పెట్టనుంది. కానీ లులుకు అప్పగించే భూమి విలువ రూ.600 కోట్లకు పైమాటే. ఇటు విజయవాడ, అటు విశాఖపట్నంలోనూ లులుకు 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఈ కంపెనీకి రెండు ప్రధాన నగరాల్లో అత్యంత విలువైన భూమి కట్టబెట్టడంపై ప్రతిపక్షాలు, పౌరులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా, పాలకులు ఖాతరు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యాయస్థానాల్లో లులు గ్రూప్నకు భూకేటాయింపులను వ్యతిరేకంగా పిటిషన్లు. గుజరాత్లో ఇదే లులు కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం భూము కొనుగోలు చేయించడంతో పాటు స్టాంప్ డ్యూటీ కింద కోట్లాది రూపాయిలు అదాయం పొందింది. లులు కంపెనీ ఉచితంగా సేవలందించే ఎన్జీఓ సంస్థ కాదు. ఈ విషయం తెలిసి కూడా వందల కోట్ల భూమిని అప్పనంగా కట్టబెట్టడం వెనుక భారీగా చేతులు మారిందనే అనుమానాల్ని ఎవరు తీర్చాలి? పాలకులు అడ్డగోలుగా ముందుకెళితే ప్రజలు నమ్మే పరిస్థితే వుంటుంది కదా? మరీ ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన పాలకులే, విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. లులు కంపెనీ రెండు చోట్లా పెట్టే పెట్టుబడి ఎంత? మన యువతకు వచ్చే ఉద్యోగాలెన్ని? అవి ఎలాంటివి? జీతభత్యాలెంత? అంతిమంగా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏంటి? తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మరోవైపు గుజరాత్ డీల్ చూసిన వారెవరికైనా... ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చెవిలో పెద్ద పువ్వు పెట్టారనే నిజం బయటపడింది. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని గతంలో ఇదే చంద్రబాబు పాలనలో వామపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాలి. అదే పరిపాలన ఇప్పుడూ కొనసాగుతుండడం ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చివరికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములనేవి మిగలవనే భయం కూడా వెంటాడుతోంది.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat

More like this